గుంటూరు

రోడ్డు ప్రమాదంలో బాలుడి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అచ్చంపేట, జూన్ 30: ముందుగా వెళ్తున్న ట్రాక్టర్‌ను దాటి రోడ్డు ఎక్కుతున్న క్రమంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పడంతో ఓ బాలుడు జారి ట్రాక్టర్ చక్రాల కింద పడి అక్కడికక్కడే ప్రాణం విడిచిన విషాదకర సంఘటన గురువారం మండల పరిధిలోని కోగంటివారిపాలెం ఆంజనేయ స్వామి గుడివద్ద చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనపై బాలుని మేనత్త ఏసమ్మ తెలిపిన వివరాలిలా ఉన్నాయి... అమరావతి మండ లం అత్తలూరు గ్రామానికి చెందిన నందిగం జోజయ్య, ఏసమ్మ అచ్చంపేటలో చదువుకుంటున్న తమ కుమారుడిని చూడటానికి వస్తున్నారు. వీరితో పాటు వారి కుమార్తె, ఏసమ్మ తమ్ముడైన బంకా సుధాకర్ కొడుకు, కూతురైన బంకా రాజేష్ (3), రాణి కూడా వస్తామని మారం చేయడంతో వీరిని కూడా టివిఎస్ ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని వస్తున్నారు. వీరి వాహనం కోగంటివారిపాలెం ఆంజనేయస్వామి గుడి దగ్గరకు చేరుకుంది. వీరికి ముందుగా వెళ్తున్న ఇసుక ట్రాక్టర్‌ను దాటి ముందుకు వస్తున్న సమయంలో ద్విచక్ర వాహనం ట్రాక్టర్‌కు తగిలి అదుపుతప్పింది. దీంతో ఏసమ్మ చేతిలో ఉన్న రాజేష్ ట్రాక్టర్ చక్రాల కింద పడ్డాడు. ఈ ఘటనలో రాజేష్ తల చిందరవందరై మెదడు భాగం రోడ్డుపై పడింది. ఏసమ్మ చేతిపైకి కూడా ట్రాక్టర్ ఎక్కడంతో చెయ్యి ఎముక విరిగిపోయింది. సంఘటనా స్థలానికి ఎస్‌ఐ రాజేశ్వరరావు వివరాలు నమోదు చేసుకోవడంతో మృతిచెందిన బాలుడి మృతదేహం, ఏసమ్మను సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.