ఆంధ్రప్రదేశ్‌

ముంపులో లంక గ్రామాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం: వరదనీటితో రాజమహేంద్రవరం వద్ద గోదావరి, కోనసీమలోని గౌతమీ, వశిష్ఠ, వైనతేయ, వృద్ధ గౌతమి, కోరంగి నదీపాయలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద నీరు పోటెత్తడంతో సుమారు 10 లంక గ్రామాల ప్రజలు నాటు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. పి.గన్నవరం మండలంలోని కనకాయలంక వద్ద కాజ్‌వే నీట మునిగి ఆ గ్రామానికి బాహ్య ప్రపంచంతో రాకపోకలు నిలిచిపోయాయి. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 8 అడుగుల నీటిమట్టం కొనసాగుతోంది. 5లక్షల 70వేల క్యూసెక్కులకు పైగా నీటిని అధికారులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. తూర్పు, మధ్య, పశ్చిమ ప్రధాన పంట కాల్వలకు 12,300 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు