తెలంగాణ

సింధు, సాక్షి జాతికే గర్వకారణం: గోపీచంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రియో ఒలింపిక్స్‌లో పతకాలను సాధించిన పివి సింధు, సాక్షి మాలిక్ భారత జాతికే గర్వకారణంగా నిలిచారని ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. ఒలింపిక్ పతక విజేత సింధుకు సత్కారం సందర్భంగా సోమవారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, తాను ఒలింపిక్స్‌లో పతకం సాధించలేకపోయినా సింధు ద్వారా తన కల నిజమైందన్నారు. గతంలో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన కరణం మల్లీశ్వరిని స్ఫూర్తిగా తీసుకుని తాను అనేక టోర్నమెంట్లలో పాల్గొన్నానని ఆయన వివరించారు. క్రీడారంగానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలవడం అభినందనీయమన్నారు. బాడ్మింటన్‌లో మరికొంతమంది ప్రతిభావంతులను తీర్చిదిద్దేందుకు తాను కృషి చేస్తానన్నారు.