తెలంగాణ

ఔట్ ఆఫ్ స్టేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 7: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె చంద్రశేఖర్‌రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇద్దరు ప్రస్తుతం ఔట్ ఆఫ్ స్టేషన్‌లో ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కంటి ఆపరేషన్ నిమిత్తం శుక్రవారం ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. ఆయన అక్కడే మరో రెండు రోజుల పాటు ఉండి ఈ నెల 10న తిరిగి రాష్ట్రానికి రానున్నారు. ఇక అమెరికా పర్యటనకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో వారం రోజుల పాటు అక్కడే ఉండి ఈ నెల 13న తిరిగి రానున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకేసారి స్థానికంగా లేకుండా పర్యటనకు వెళ్లిన సందర్భం ఇదే తొలిసారి. తెలంగాణ సిఎం కెసిఆర్ గతంలో పది రోజుల పాటు చైనా పర్యటనకు వెళ్లిన సందర్భం తప్ప ఆయన సాదారణంగా బయటికి వెళ్లారు. ఇద్దరు సిఎంలు అందుబాటులో లేకపోవడంతో ఇక్కడ ప్రగతి భవన్, అక్కడ అమరావతి రెండూ బోసిబోయాయి. ముఖ్యమంత్రులు ఇద్దరు స్థానికంగా లేకపోవడంతో మంత్రులు కూడా సచివాలయం వైపు వైపు రాకుండా శీతకన్ను వేశారు. ముఖ్యమంత్రులు స్థానికంగా లేకపోవడం, మంత్రులు సచివాలయానికి రాకపోవడంతో ఇరు రాష్ట్రాల్లో అధికారిక కార్యకలాపాలు దాదాపు నిలిచిపోయాయని చెప్పవచ్చు.