ఆంధ్రప్రదేశ్‌

యువకుడిని హతమార్చినమావోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతూరు, ఏప్రిల్ 7: చింతూరు మండలం ఏడుగుర్రాలపల్లిలో ఇటీవల కిడ్నాప్‌చేసిన యువకుడిని మావోయిస్టులు హతమార్చారు. గ్రామానికి చెందిన చెన్నూరి శంకర్ (22)ను మావోయిస్టులు గత కొన్ని రోజుల క్రితం కిడ్నాప్ చేసిన విషయం విదితమే. ఎటపాక మండలం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు శంకర్‌ను హతమార్చి, మృతదేహాన్ని అక్కడే వదిలివెళ్లారు. బుధవారం ఎటపాక పోలీసులకు అటవీ ప్రాంతంలో ఓ వ్యక్తి మృతిచెందినట్టు సమాచారం రావడంతో అక్కడకువెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. గుర్తుతెలియని వ్యక్తి మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. మీడియాలో ఎటపాక అటవీ ప్రాంతంలో యువకుడిని మావోయిస్టులు హతమార్చినట్టు గురువారం కథనాలు రావడంతో శంకర్ తల్లిదండ్రులు ఎటపాక వెళ్లి, పోలీసుల వద్ద ఉన్న మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం తమ కుమారుడిదేనని వారు గుర్తించారు. కుటుంబంతో సహా ఏడుగుర్రాలపల్లి గ్రామాన్ని వదిలి, గత రెండు నెలల కిందట వరంగల్ జిల్లా తాడ్వాయి గ్రామానికి వెళ్లి నివసిస్తున్నామన్నారు. గత నెల 30నుండి తమ కుమారుడి శంకర్ ఆచూకీ తెలియరాలేదని వారు తెలిపారు. శంకర్ మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.