తెలంగాణ

బస్సు ఢీకొని విద్యార్థిని మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రోడ్డు దాటుతున్న కళాశాల విద్యార్థినిని బస్సు ఢీకొని మృతిచెందిన ఘటన కూకట్‌పల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జగద్గిరిగుట్టకు చెందిన రమ్య కూకట్‌పల్లిలోని చైతన్య కళాశాలలో ఇంటర్ చదువుతుంది. కాలేజీ బస్సు దిగి రోడ్డు దాటుతుండగా అదే కళాశాలకు చెందిన బస్సు ఢీకొని అక్కడికక్కడే మృతిచెందింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే విద్యార్థిని చనిపోయిందని భావించిన విద్యార్థులు బస్సు అద్దాలను పగులగొట్టి విధ్వంసం సృష్టించారు. పోలీసులు పరిస్థితిని అదుపులోనికి తీసుకువచ్చారు. డ్రైవర్ పరారీలో ఉన్నాడు.