రాష్ట్రీయం

విపరీత బుద్ధులు వినాశకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్టీ ఫిరాయింపుదారులపై సిఎల్‌పి నేత జానా వ్యాఖ్య
మిర్యాలగూడ, డిసెంబర్ 6: విపరీత బుద్ధులు వినాశకాలే అని శాసనసభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు కుందూరు జానారెడ్డి ఇటీవల ఆయా పార్టీల నుండి టిఆర్‌ఎస్‌లోకి వలసలు వెళ్లడంపై వ్యాఖ్యానించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని బైపాస్ రోడ్డులో డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఇటీవల కొంతమంది కాంగ్రెస్, టిడిపి తదితర పార్టీల నాయకులు తమ సొంత పార్టీలను వీడి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరడాన్ని ఆయన దృష్టికి తీసుకురాగా ఆ పార్టీలో చేరడం ఎందుకు అని ఆలోచించకుండా చేరుతున్నారని అన్నారు. సహనం ఉంటే ఏ పార్టీలోనైనా అభివృద్ధి చెందవచ్చని ఆయన అన్నారు. సహనం లేకనే పార్టీలు మారుతున్నారన్నారు. నల్లగొండ స్థానిక సంస్థల శాసనమండలి అభ్యర్థి ఎవరనే ప్రశ్నకు సమాధానంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తే వారినే గెలిపించేందుకు వ్యూహరచన చేస్తున్నామని ఆయన అన్నారు. పార్టీ అభ్యర్థి గెలుపునకు రాష్ట్ర, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఏకతాటిపై పనిచేస్తారని ఆయన అన్నారు. ఆయన వెంట స్థానిక శాసనసభ్యుడు నల్లమోతు భాస్కర్‌రావు, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరునగరు భార్గవ్, వైస్‌చైర్మన్ మగ్దుంపాషా, ఎంపిపి ఒగ్గు జానయ్య, కౌన్సిలర్లు ఎండి.మాజిద్, సోమసుందర్, నవాబ్, ఎండి.ఖాదర్ ఉన్నారు.