తెలంగాణ

జనగామలో ఆర్టీసీ బస్సుకు నిప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్: జనగామ ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని కోరుతూ శుక్రవారం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. ఆందోళనకారులు జనగామ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తుండగా కొందరు వ్యక్తులు ఆర్టీసీ బస్సులపై రాళ్లు రువ్వారు. దీంతో మూడు బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఓ బస్సుకు నిప్పంటించడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది.