ఆంధ్రప్రదేశ్‌

కాపులను బిసిల్లో చేర్చాల్సిందే: రఘువీరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 23: కాపులను వెనుకబడిన వర్గాల్లో చేర్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని పిసిసి చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి అన్నారు. విశాఖ జిల్లా కాపు సంఘం ఆధ్వర్యంలో నగరంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో దివంగత నేత కోట్ల విజయభాస్కర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాపులను వెనుకబడిన వర్గాల్లో చేర్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. తర్వాత వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అమలు చేయకుండా అడ్డుతగిలిందని ఆరోపించారు. రిజర్వేషన్లు 50 శాతం మించినప్పటికీ కాపులకు న్యాయం చేయాల్సి ఉందన్నారు. కాపులను బిసి జాబితాలో చేర్చే అంశాన్ని వచ్చే బడ్జెట్ సమావేశాల్లో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో కాపు సంఘం అధ్యక్షుడు రామిరెడ్డి మురళి, మాజీ మంత్రి వట్టి వసంతకుమార్, మాజీ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్, కాపు సంఘం నాయకులు గుంటూరు వెంకటనర్శింహమూర్తి పాల్గొన్నారు.