తెలంగాణ

మల్లన్న సాగర్‌పై సీఎం కేసీఆర్ సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మల్లన్న సాగర్ ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారం పంపిణీ ఎంతవరకు వచ్చింది. ఇంకా ఎంతమందికి ఇవ్వాలో తెలియజేస్తూ పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు పరిహారం, సహాయ పునరావాస చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలోనూ, ఈనెల 15న నిర్వాసితులకు పరిహారం చెల్లింపు వ్వవహారం హైకోర్టులో విచారణకు రానున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. చెక్కుల పంపిణీ ప్రక్రియ ఎంతవరకు వచ్చిందో అడిగి తెలుసుకున్నారు. ఎంత మందికి ఎంత మొత్తంలో చెక్కులు పంపిణీ చేశారో అడిగి తెలుసుకున్నారు. కాగా ఈ సమావేశంలో సీఎస్ జోషీతో పాటు సోమేశ్‌కుమార్, స్మితా సబర్వాల్, జిల్లా కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.