రాష్ట్రీయం
దుర్గమ్మకు మొక్కు చెల్లించిన కేసీఆర్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 28 June 2018
విజయవాడ: కనక దుర్గమ్మకు తెలగాణ సీఎం కేసీఆర్ మొక్కు చెల్లించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న కేసీఆర్కు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు, ముక్కు పుడక సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక దుర్గమ్మకు ముక్కు పుడక సమర్పిస్తానని కేసీఆర్ మొక్కుకున్న విషయం తెలిసిందే. అంతకుముందు సీఎం కేసీఆర్కు గన్నవరం ఎయిర్ పోర్టులో ఏపీ మంత్రి దేవినేని ఉమ స్వాగతం పలికారు. కేసీఆర్తో పాటు నాయిని, కేకే, ఇంద్రకరణ్ రెడ్డి, వేముల తదితరులు ఉన్నారు.