ఆంధ్రప్రదేశ్
తుని ఘటనలో నిందితులపై కఠిన చర్యలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 7 June 2016
గుంటూరు: తుని విధ్వంసకాండలో నిందితులందరిపైనా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, ఇకముందు ఇలాంటి ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండేందుకే కేసులు పెడుతున్నామని ఎపి హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మంగళవారం ఇక్కడ మీడియాకు తెలిపారు. తుని ఘటనలో నిందితులంతా నేరచరిత్ర ఉన్నవారేనని అన్నారు. రౌడీషీటర్లు, వైకాపాతో సంబంధాలున్నవారు తుని వద్ద విధ్వంసానికి పాల్పడ్డారని తెలిపారు. ఇలాంటి ఘటనలు జరిగినపుడు కఠిన చర్యలు తీసుకోకుంటే పరిస్థితులు ముందు ముందు అదుపుతప్పుతాయన్నారు. నేరస్థులెవరినీ విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. తగిన సాక్ష్యాధారాలున్నందునే నిందితులను సిఐడి పోలీసులు అరెస్టు చేస్తున్నారని వివరించారు.