రాష్ట్రీయం

ఖమ్మం మార్కెట్‌కు లక్ష బస్తాల మిర్చి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మార్చి 17: మిర్చి బస్తాలతో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పొటెత్తింది. ఈ ఏడాది మొదటి నుంచి మిర్చి ధర అధికంగా ఉంటుందని ఆశించారు. అదే స్థాయిలో ధర ఉండటంతో రైతులు మార్కెట్‌కు మిర్చిని వారం రోజులుగా తరలిస్తున్నారు. క్వింటాలు ధర 11వేల నుంచి 12,300వరకు ఉండటంతో రైతులు తాము పండించిన పంటను మార్కెట్‌కు తరలించటంతో మార్కెట్ మిర్చి బస్తాలతో నిండిపోయింది. ఇప్పటి వరకు రోజుకు 50వేల వరకు తరలిన బస్తాలు గురువారం ఒక్కరోజే సుమారు లక్ష మిర్చి బస్తాలు మార్కెట్‌కు వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు. మార్కెట్ సరిపోకపోవటంతో ఆ ప్రాంతంలోని రోడ్లపై మార్కెట్ బస్తాలు ఉంచారు. ఒకేసారి ఇంత మొత్తంలో మార్కెట్‌కు మిర్చి తరలిరావడానికి పెరిగిన ధరే కారణమని అధికారులు చెప్తున్నారు.