కృష్ణ

రోడ్డు ప్రమాదంలో వ్యవసాయ కూలీ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంచికచర్ల, జూలై 11: మండలంలోని మొగులూరు మలుపు వద్ద సోమవారం జరిగిన ఆటో ప్రమాదంలో మహిళా వ్యవసాయ కూలీ మృతి చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. సేకరించిన సమాచారం ప్రకారం మండలంలోని వేములపల్లి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు ఆటోలో మొగులూరు గ్రామం వెళుతుండగా మొగులూరు మలుపు వద్ద ఆటో అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో బి రాజ్యలక్ష్మి (58) మృతి చెందగా మరో ముగ్గురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.