కృష్ణ

నేడు రియో స్టార్ సింధు రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), ఆగస్టు 22: రియో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో రజత పతకం సాధించి భారతదేశానికి గర్వకారణంగా నిలిచిన తెలుగుతేజం పివి సింధు మంగళవారం నగరానికి రానుంది. సోమవారం హైదరాబాద్‌కు చేరుకున్న సింధు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకు మంగళవారం హైదరాబాద్ నుండి కుటుంబ సభ్యులతో కలిసి గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనుంది. అక్కడి నుండి నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంకు భారీ ర్యాలీతో తీసుకురానున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో గన్నవరం నుండి స్టేడియంకు అధాకారులు, క్రీడాకారులు, క్రీడాభిమానులతో భారీ ర్యాలీతో సింధును తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. స్టేడియంలో ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు సింధుతో పాటు కోచ్ గోపీచంద్, సింధు తల్లిదండ్రులను ఘనంగా సత్కరించనున్నట్లు తెలిసింది. అనంతరం స్టేడియం నుండి దుర్గా ఘాట్‌లో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు సింధు వెళ్ళనుంది. దుర్గా ఘాట్ నుండి సాయంత్రం పవిత్ర సంగమంలో జరగనున్న హారతి కార్యక్రమానికి హాజరవుతుందని అధికారులు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్‌తో పాటు మున్సిపల్ కమిషనర్, క్రీడాధికారులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.