కృష్ణ

అంధులకు మహిళా పోలీసు సిబ్బంది వితరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), అక్టోబర్ 29: నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో వివిధ చోట్ల పని చేస్తూ 25వసంతాలు పూర్తి చేసుకున్న మహిళా సిబ్బంది ఆధ్వర్యంలో అంధ విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ జరిగింది. 1991 బ్యాచ్‌కు చెందిన మహిళా పోలీసు సిబ్బంది మొత్తం 36మంది తమ సర్వీసులో 25ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పోలీసు కమిషనర్ కార్యాలయంలో కేక్ కటింగ్ ఏర్పాటు చేశారు. పోలీసు కమిషనర్ దామోదర్ గౌతం సవాంగ్ కేక్ కటింగ్ చేసి ప్రతి ఒక్కరిని అభినందించారు. దీంతో ఇక్కడ పండుగ వాతావరణం నెలకొంది. ఈసందర్భంగా గుణదలలోని విజయ మేరి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఫర్ బ్లైండ్ స్కూల్ విద్యార్థులు 90మందికి సీపి సవాంగ్ చేతుల మీదుగా దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీపి మాట్లాడుతూ ముందుగా అందరికీ శుభాకాంక్షలు తెలియచేశారు. సిబ్బంది ఇదే స్ఫూర్తితో ప్రజల పట్ల సేవాభావంతో మెలగాలని సూచించారు. పోలీస్టేషన్‌కు వచ్చే వారితో సహనంగా మెలగాలని వారి సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలని, అదేవిధంగా మహిళా చైతన్య సమితిలో భాగస్థులై వారికి సేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపితోపాటు జాయింట్ పోలీసు కమిషనర్ పి హరికుమార్, అడ్మిన్ డిసిపి జివిజి అశోక్‌కుమార్, స్పెషల్ బ్రాంచి ఏసిపి రమేష్‌బాబు, విజయవాడ పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు సోమయ్య, సభ్యులు వి గోపి, 1991వ బ్యాచ్‌కు చెందిన మహిళా సిబ్బంది పాల్గొన్నారు.