కృష్ణ

పోర్టునెవరూ అడ్డుకోలేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, నవంబర్ 19: ఎవరెన్ని కుయుక్తులు పన్నినా బందరు ఓడరేవు, పారిశ్రామిక వాడ నిర్మాణాన్ని అడ్డుకోలేరని రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావులు స్పష్టం చేశారు. మరో రెండు నెలల్లో పోర్టు నిర్మాణ పనులను ప్రారంభించి రెండేళ్ళల్లో పూర్తి చేస్తామన్నారు. 2018 నాటికి బందరుకు ఓడను తీసుకువస్తామన్నారు. జన చైతన్య యాత్రల్లో భాగంగా శనివారం పోర్టు, పారిశ్రామిక వాడ ప్రతిపాదిత గ్రామాలైన మంగినపూడి, తపసిపూడి, గోపువానిపాలెం, మేకావానిపాలెం, పోతిరెడ్డిపాలెం, పొట్లపాలెం, పోతేపల్లి గ్రామాల్లో వారు పర్యటించారు. పదేళ్ళు అధికారంలో ఉన్న ప్రతిపక్షం పోర్టు పేరుతో ఈ ప్రాంత ప్రజలను మభ్య పెట్టిందని విమర్శించారు. స్వార్ధ రాజకీయాల కోసం పోర్టును తాకట్టు పెట్టారన్నారు. ప్రజా ఉద్యమానికి తలొగ్గిన నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచార్భాటంగా పోర్టుకు శంకుస్థాపన చేసి లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పోర్టు నిర్మాణం పట్ల ప్రత్యేక దృష్టి సారించామన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడిన అడ్డంకులన్నింటినీ ఎదుర్కొని ల్యాండ్ పూలింగ్ ద్వారా భూముల సమీకరణకు శ్రీకారం చుట్టామన్నారు. దీన్ని సైతం ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవాలని చూస్తుండటం గమనార్హం. అభివృద్ధికి కలిసి రాకుండా స్వార్ధ రాజకీయాల కోసం ఈ ప్రాంత ప్రజలను మాయ మాటలు చెప్పి వారి భవిష్యత్తు దెబ్బతినే విధంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. పోర్టు పేరుతో ప్రతిపక్షం చేస్తున్న రాద్ధాంతాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. పోర్టు, పరిశ్రమల స్థాపనకు భూములిచ్చే రైతులకు మెరుగైన ప్యాకేజీ ఇవ్వడం జరుగుతుందన్నారు. దీని ద్వారా రైతులు పదింతలు లబ్ధి పొందే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న భూముల ధర పోర్టు నిర్మాణానంతరం కోట్లాది రూపాయలకు చేరే అవకాశం ఉందన్నారు. అలాగే ఈ ప్రాంతంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యను పూర్తిగా పరిష్కారమవుతుందన్నారు. ఆరు పదుల వయస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్భ్రావృద్ధికి రాత్రింబవళ్ళు శ్రమిస్తున్నారన్నారు. చంద్రబాబు పాలనకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ గోపు సత్యనారాయణ, టిడిపి సీనియర్ నాయకులు గొర్రిపాటి గోపిచంద్, టిడిపి మండల అధ్యక్షులు తలారి సోమశేఖర్, పార్టీ నాయకులు కుంచే దుర్గా ప్రసాద్ (నాని), రాజులపాటి సత్యనారాయణ, వాలిశెట్టి తిరుమలరావు, కాగిత ఏడుకొండలు, కాటం మధుసూధనరావు, కమ్మిలి మధుసూధనరావు తదితరులు పాల్గొన్నారు.
రాజమహేంద్రవరంలో
తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలి
* పద్మభూషణ్ యార్లగడ్డ
నందిగామ, నవంబర్ 19: రాష్ట్ర విభజన కారణంగా సీమాంధ్ర ప్రాంత విద్యార్థులకు తీరని అన్యాయం జరిగిందని, తక్షణం ప్రభుత్వం రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించి తెలుగు విద్యార్థులను న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమీ చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యుడు పద్మభూషణ్ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. కృష్ణాజిల్లా నందిగామ కెవిఆర్ కళాశాలలో శనివారం జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమానికి విచ్చేసిన ఆయన విలేఖరులతో మాట్లాడుతూ మాతృభాషను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని, అందుకు ప్రజలు సహకరించాలన్నారు. ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులు అన్నీ తెలుగుభాషలోనే కొనసాగించాలని చెబుతున్నా అమలు జరగడం లేదన్నారు. మాతృభాషలోనే శిలాఫలకాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో నాలుగు వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమంలో విద్యాబోధన ప్రారంభించారన్నారు. మమీ, డాడీ సంస్కృతిపై తల్లిదండ్రులు చూపుతున్న ఆశక్తిని విడనాడి మాతృభాషను ప్రేమించాలన్నారు. పొరుగు రాష్ట్రాల్లో మాతృభాషలో చదివిన వారికి ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని, అదే మాదిరిగా మన రాష్ట్రంలోనూ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ వాసిరెడ్డి సత్యనారాయణ ప్రసాద్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వాసిరెడ్డి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రాంతాల వారీగా గిట్టుబాటు ధర ఇవ్వాలి
నూజివీడు, నవంబర్ 19: వివిధ పంటలు పండించే రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని కేంద్రప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలను ప్రకటించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. దేశంలో ఒకే పంట పలు ప్రాంతాల్లో పండిస్తున్నప్పటికీ, సాగుబడికి అయ్యే ఖర్చు ప్రాంతాలను బట్టి ఉంటోందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని గిట్టుబాటు ధర ఇస్తే రైతులకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గం పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శనివారం ప్రారంభించారు. అనంతరం జన చైతన్య యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రస్తుత సీజన్‌లో ధాన్యం మద్దతు ధర క్వింటాలుకు 1, 510 రూపాయలు ఇస్తున్నామని, దీనిని పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో కోస్తాతీరం ఎక్కువగా ఉందని, ఈ ప్రాంతంలో పంటలు పండించేందుకు ఇతర ప్రాంతాలతో పోల్చితే ఎక్కువ వ్యయం అవుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో అన్ని ప్రాంతాలకు ఒకే విధంగా మద్దతు ధర ఇవ్వటం సమంజసం కాదని చెప్పారు. ప్రాంతాల వారీగా రైతులు పండించే పంటలు, పెట్టే పెట్టుబడులు దృష్టిలో ఉంచుకుని మద్దతు ధర ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తున్నట్లు మంత్రి ప్రత్తిపాటి వెల్లడించారు. గత సంవత్సరం 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, ఈ ఏడాది 46 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు వల్ల నల్లధనం బయట పడుతుందని, సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలోని పాల ఉత్పత్తి కేంద్రాల్లోని సభ్యులు వారి బ్యాంకు ఖాతాలలో డిపాజిట్లు చేసుకోవచ్చని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, దేశానికి ఆదర్శవంతంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విశేషంగా కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగుతోందని, పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ప్రవేశ పెట్టిన చంద్రన్న బీమా కార్యకర్తలకు వరం అని అన్నారు. గ్రామాల్లో సిమెంట్ రోడ్లకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.