కృష్ణ

బిల్లు లేని 35 కిలోల వెండి స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెదపారుపూడి, అక్టోబర్ 28: బిల్లులు లేకుండా రూ.15 లక్షల విలువైన వెండి ఆభరణాలు తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని వెండి సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్‌ఐ డి సందీప్ తెలిపారు. శుక్రవారం పెదపారుపూడి పోలీస్‌స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గురువారం అర్ధరాత్రి సమయంలో వెంట్రప్రగడ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా రెండు వేగనార్ కార్లలో 35కిలోల విలువైన వెండి ఆభరణాలను గుడివాడకు చెందిన సునీల్‌జైన్, విక్రమ్‌కుమార్ జైన్, రాజేష్‌కుమార్ జైన్, చిగురుపాటి పవన్‌కుమార్, విక్రమ్‌కుమార్ సింగ్ జైన్, అడపా రాజేష్‌లు తరలిస్తుండగా ఆభరణాలను గుర్తించామన్నారు. వీటికి బిల్లులు లేకపోవడంతో ఆరుగురినీ అదుపులోకి తీసుకుని స్వాధీనం చేసుకున్నామన్నారు. 35 కిలోల వెండిని ఆదాయపు పన్నుశాఖ అధికారులకు స్వాధీనం చేస్తున్నామని తెలిపారు. వ్యక్తిగత పూచీకత్తుపై ఆరుగురిని విడుదల చేశామని చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.