కృష్ణ

తాటిచెట్టు పైనుండి పడి కార్మికుని మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడూరు, ఏప్రిల్ 19: ప్రమాదవశాత్తూ తాటిచెట్టు పైనుండి పడి ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని గోపాలపురం పోలిమేరకోడు వద్ద మంగళవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. దొడ్లపాలెం గ్రామానికి చెందిన బొంతు ప్రభాకరరావు(49) వృత్తిరీత్యా తాటాకు కొట్టటం, కల్లు తీయటం చేస్తాడు. మంగళవారం ఉదయం తాటాకులు కొడుతుండగా కాళ్లకు కట్టుకున్న బంధం తెగిపోవటంతో ప్రభాకరరావు తాటిచెట్టు పైనుండి జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. బంధువులు ఇచ్చిన సమాచారం మేరకు ఎస్‌ఐ విల్సన్ బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోపూడిలో మరో కార్మికుడి మృతి
ముసునూరు : తాడిచెట్టు పైనుండి పడి గీత కార్మికుడు మృతి చెందిన సంఘటన లోపూడి గ్రామంలో మంగళవారం జరిగింది. బోట్ల శ్రీనివాసరావు(30) కల్లుగీత కార్మికునికిగా జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం ఉదయం కల్లుగీసేందుకు తాటిచెట్టు ఎక్కిన శ్రీనివాసరావు తన నడుముకు ఉన్న తాడు తెగిపోవడంతో చెట్టు పై నుండి కిందకు పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీనివాసరావు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.