కృష్ణ

చంద్రబాబుది నయవంచక దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట, జూన్ 2: రాష్ట్రాన్ని విభజించడానికి కేంద్రానికి నాలుగుసార్లు లేఖలు ఇచ్చి రాష్ట్ర విభజనకు లోక్‌సభలో తొలి ఓటు మా పార్టీదే అని ప్రకటించి రాష్ట్రాన్ని విడగొట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవ నిర్మాణ దీక్ష పేరుతో రాష్ట్ర ప్రజలను వంచిస్తున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభాను ధ్వజమెత్తారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని కృష్ణా, గోదావరి నదులను తెలంగాణ ప్రభుత్వానికి తాకట్టు పెట్టారని గురువారం ఆయన ఒక ప్రకటనలో ఆరోపించారు. అవినీతి, అక్రమాలపై సిబిఐ విచారణ జరగకుండా ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టి, రాష్ట్భ్రావృద్ధికి ప్రాణాధారమైన జలాలను అమ్మేసిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. బాబు రెండేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యమన్నారు. వ్యవసాయ రంగాన్ని ఆయన దెబ్బతీశారన్నారు. విభజనకు వ్యతిరేకంగా పోరాడిన ఒకే ఒక్క నేత వైఎస్ జగన్మోహనరెడ్డి అని ఉదయభాను పేర్కొన్నార