కృష్ణ

ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ: ప్రజలు నాకిచ్చిన ఐదేళ్ల ఎమ్మెల్యే పదవికి తగు న్యాయం జరిగేలా కృషి చేస్తానని శాసనసభ్యుడు సింహాద్రి రమేష్‌బాబు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో పని చేస్తూ స్థిర పడిన దివిసీమ మిత్ర బృందం ఆధ్వర్యంలో మండల పరిధిలోని పులిగడ్డ ఇరిగేషన్ అతిథి గృహం ఆవరణలో ఆదివారం ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు దంపతులను ఘనంగా సన్మానించారు. న్యాయవాది గడ్డం బాబూరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డీజీపీ బాబూరావు మాట్లాడుతూ కళాశాల విద్యాభ్యాసం నుండే సింహాద్రి రమేష్‌బాబు ఉద్యమాలు నిర్వహించారన్నారు. విద్యార్థుల తరపున ఎన్నో పోరాటాలు చేశారని కొనియాడారు. ఈ సందర్భంగా సింహాద్రి మాట్లాడుతూ ఇంటర్, డిగ్రీ చదివే రోజుల్లో ఉన్న మిత్రం బృందం అందరూ ఒక చోట కలుసుకోవటం ఆనందంగా ఉందన్నారు. తన మిత్రులు, నియోజకవర్గ ప్రజలు అందరూ చేస్తానన్నారు. ఈ సందర్భంగా సింహాద్రి రమేష్‌బాబు, ఆయన సతీమణి లక్ష్మిని గజ మాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు మారియబాబు, బడే వెంకటేశ్వరరావు, సిహెచ్ వెంకటేశ్వరరావు, న్యాయవాది సింహాద్రి శివాజి, పి కిషోర్, జగన్మోహనరావు, హైదరాబాద్‌లో స్థిరపడిన సింహాద్రి మిత్ర బృందం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.