కృష్ణ

విద్యుదాఘాతానికి వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెదపారుపూడి, జూలై 26: విద్యుత్‌శాఖ అధికారులు నిర్లక్ష్యం కారణంగా ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం వానపాముల గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే నందిగామ మండలం పెద్దవరం గ్రామానికి చెందిన కట్టా జయరాజు(48) కూలి పనుల కోసం బృందంతో వానపామలు వచ్చారు. వానపాముల ప్రముఖుడు పొలంలో నారుపనులు చేస్తూ భోజనం చేసిన అనంతరం చేయి కడుక్కునేందుకు బోరు వద్దకు వెళ్తుండగా స్తంభం సపోర్టు వైరు తగిలి విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తోటి కూలీలు వెళ్ళి చూడగా మృతి చెందినట్టు తెలిపారు. గత నెల్లో ఇదే వైరు తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మరువకుండానే అదే ప్రాంతంలో మరో వ్యక్తి మృతి చెందడంతో గ్రామస్థులు భయాందోళనలు చెందుతున్నారు. గతంలో విద్యుత్‌శాఖ అధికారులు మరమ్మతులు చేపట్టినా మరలా విద్యుత్ షాక్‌కు గురికావడంతో సంబంధిత శాఖ అధికారులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.