కృష్ణ

లారీ బోల్తా.. కార్మికుని మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాట్రాయి, జూలై 26: పొట్టకూటికోసం బోర్లు వేస్తు జీవనం సాగిస్తున్న వ్యక్తి బోరువేసే రాడ్లు కిందపడి మృత్యువాత పడిన సంఘటన బుధవారం చాట్రాయి మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లో కెళ్ళితే మండలంలోని జనార్ధనవరం గ్రామంలో బోరువేసేందుకు నూజివీడు మండలం లీలానగర్ నుండి మంగళవారం మధ్యాహ్నం జనార్ధనవరం గ్రామానికి వస్తుండగా మండలంలోని చిత్తపూర్ గ్రామం దాటిన తరువాత కోళ్ళపారం మలుపువద్ద పై ఉన్న విద్యుత్ తీగలు తగులుతాయేమోనన్న అనుమానంతో డ్రైవర్ గురుస్వామి రామలింగం లారీని తప్పించబోయే క్రమంలో కుడివైపున ఉన్న గోతులోకి లారీ బోల్తా పడింది. బోరు బండిపై కూర్చున్న కూలీలు ఒట్టి మహేంద్రకుమార్ (25), కిందపడిపోగా బోరురాడ్లు అతనిపై పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. శ్యామ్‌కుమార్ అనే కూలీకి కూడా తీవ్ర గాయాలు కావడంతో108లో విజయవాడ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ గురుస్వామి రామలింగంకు స్వల్ప గాయాలైనాయి. మహేంద్రకుమార్, శ్యామ్‌కుమార్‌లు ఛతీస్‌గడ్ వాసులని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్త్నుట్లు పోలీసులు వివరించారు.