కృష్ణ
రాష్టస్థ్రాయి హేండ్బాల్ పోటీలకు వల్లూరుపాలెం విద్యార్థులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తోట్లవల్లూరు, సెప్టెంబర్ 9: రాష్టస్థ్రాయి హ్యాండ్బాల్ పోటీలకు వల్లూరుపాలెం జడ్పీ హైస్కూల్ విద్యార్థులు మరోసారి ఎంపికవటం గర్వకారణమని హెచ్ఎం వి శ్రీనివాస్ అన్నారు. జిల్లా స్థాయిలో హ్యాండ్బాల్ సెలక్షన్స్ ఈ నెల 8న పటమట జెడ్పీ హైస్కూల్లో జరిగాయని, అందులో వల్లూరుపాలెం విద్యార్థులు రాష్టస్థ్రాయి పోటీలకు ఎంపికయ్యారని ఆయన శుక్రవారం తెలిపారు. బాలికల విభాగంలో అండర్ 17 విభాగంలో ఎం దివ్య, పి అఖిల, ఎస్ భార్గవి, పి స్రవంతి, పి వౌనిక, ఎన్ షైని, అండర్ 14 విభాగంలో వి నిఖిత, వి సాయితేజ, టి దీపిక, బాలుర అండర్ 17 విభాగంలో పి అరవింద్, టి రాజశేఖర్, అండర్ 14 విభాగంలో వి దినేష్, ఎం వెంకన్న, వి లక్ష్మణకుమార్, ఎస్ వినయ్ అర్హత సాధించారని వివరించారు. గత జూలైలో రాష్ట్ర స్థాయి ఓపెన్మీట్ రాష్టస్థ్రాయి హేండ్బాల్ పొటీలకు కూడా తమ విద్యార్థులు అర్హత సాధించి మంచి ప్రతిభ కనపర్చారని శ్రీనివాస్ తెలిపారు.