కృష్ణ
నేడు పవిత్ర సంగమం వద్ద సిఎం పూజలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 11 August 2016
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 10: ఇబ్రహీంపట్నం మండలంలోని పవిత్ర సంగమం పుష్కర ఘాట్ని గురువారం ముఖ్యమంత్రి ప్రారంభించనున్నట్లు మండల అభివృద్ధి అధికారి కె శ్రీనివాసరెడ్డి తెలిపారు. పుష్కరుడు కృష్ణానది పరివాహక ప్రాంతంలో ప్రవేశించగానే నది పరివాహనంలో సంచరించటం జరుగుతుందని అందుకే గురువారం రాత్రి 9.15 గంటలకు ముహూర్తం నిర్ణయించటంతో అక్కడే ఉండి పూజలు నిర్వహిస్తారన్నారు. పవిత్ర సంగమం ఘాట్ వద్ద పారిశుద్ధ్య పనులు, రోడ్లు శుభ్రపరిచే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని నిర్ణయించినా పనులు మాత్రం నామమాత్రం సాగుతున్నాయి. ముఖ్యమంత్రి రాకను గమనించి గాంధీ బొమ్మ సెంటర్ నుండే పోలీసులు వాహనాలు అనుమతించడం లేదు.