కరీంనగర్

అన్నారం పంప్ హౌస్ సర్వే పనులు అడ్డగింత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహదేవపూర్, సెప్టెంబర్ 13: మండలంలోని కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద అన్నారంలో పంప్ హౌస్ నిర్మాణ స్థలాన్ని సర్వే చేస్తున్న రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులను మంగళవారం ఆ గ్రామానికి చెందిన రైతులు రవీందర్, రాయబాపు, చంద్రశేఖర్, మరో 30 మంది రైతులు అడ్డుకున్నారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మా భూముల్లో పంప్ హౌస్ నిర్మాణం కోసమని సర్వే చేస్తున్నారని, ఎలాంటి నష్టపరిహారం ఇస్తారో అని చెప్పకుండా సర్వే చేయడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం నష్టపరిహారం ఏమి ఇస్తుందో.. చెప్పిన తరువాతనే మా అంగీకారం మేరకు సర్వే పనులు మొదలు పెట్టాలని వారు పేర్కొన్నారు. సర్వేకు వచ్చిన అధికారులలో డిప్యూటీ తహశీల్దార్ రవీందర్, సర్వేయర్ దశరథం, డిప్యూటీ ఇఇ యాదగిరి, సతీష్, జెఇలు జయంత్, విఆర్‌ఓ అరుణ్ ఉన్నారు. అడ్డుకున్న విషయాన్ని డిప్యూటీ తహశీల్దార్ రవీందర్ పై అధికారుల దృష్టికి తీసుకెళ్తానని రైతులకు చెప్పారు.