కరీంనగర్

చొప్పదండిలో కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చొప్పదండి, ఆగస్టు 16: కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీపై అర్ధరహిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ మం త్రి కేటీఆర్ దిష్టిబొమ్మను గురువారం చొప్పదండి నియోజకవర్గ కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో గల రాష్ట్ర రహదారిపై కాంగ్రెస్ నేత మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు దగ్ధంచేశారు. ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ కరీంనగర్‌ను లండన్ గా మారుస్తానని చెప్పిన కేసీఆర్ మాటలను ఇంతవరకు ఎందుకు సాధ్యం చేయలేదని, కనీసం వౌలిక సదుపాయాలైన డ్రైనేజీవ్యవస్థ అస్తవ్యస్తంగా, అంతర్గత రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారిందని, దీనిపై కేటీఆర్ స్పందించాలని, నాలుగున్నర ఏళ్ల పాలన ముగిసినప్పటికీ కేసీఆర్ గుప్పించిన హామీలు ఏమయ్యాయంటూ విమర్శించారు. సిరిసిల్ల టు హైదరాబాద్ పోయ్యే రోడ్లు కాంగ్రెస్ హయాంలో వేసినవి కావా? అంటు ప్రశ్నించారు. గత కేంద్ర ప్రభుత్వాలైన బీజేపీ తెలంగాణ ఇవ్వలేదని, అప్పు డు మూడు రాష్ట్రాలు ఇచ్చిన బీజేపీకి వంతపాడిన కేసీఆర్ తెలంగాణ ప్ర జల మనోభావాలను గమనించిన సో నియమ్మ తెలంగాణ ఇచ్చి ఆంధ్రాలో నష్టం జరిగినా తెలంగాణ బిడ్డల చిరకాల కోరిక తీర్చిందని, తెలంగాణను సోనియమ్మ ఇస్తే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రారంభించిన ప్రాజెక్టులను రీ-డిజైన్ల పేరిట కేసీఆర్ కుటుంబ పాలనలో కోట్లు దండుకుంటున్నారని విమర్శించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కోమటి రెడ్డి పద్మాకర్‌రెడ్డి, ఎం పీటీసీ ముద్దసాని రంగన్న, మాజీ మార్కెట్ చైర్మన్ పురం రాజేశం, టీ పీబీసీ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు ము ద్దం తిరుపతి, గుర్రం రమేష్, రాజేందర్, మహేశుని మల్లేశం, మునిగాళ్ల సుధాకర్ గౌడ్ పలువురు పాల్గొన్నారు.