కరీంనగర్

లలితాత్రిపురసుందరీదేవిగా అమ్మవారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సారంగాపూర్, అక్టోబర్ 14: దుర్గానవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఐదోరోజు అమ్మవారు లలితా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంబట్ల గ్రామంలోని దుబ్బరాజేశ్వరసా వమి ఆలయంలో పూజారులు అమ్మవారిని పసుపుకొమ్ములతో అలంకరించి స హస్రనామాలతో త్రిపురసుందరీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పలుగ్రామాలలో అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు ఘనంగా పూజలు నిర్వహించా రు. దుర్గాష్టామి సందర్బంగా పలువురు భక్తులు అమ్మవారి దీక్షను చేపట్టి భక్తిశ్రద్దలు, నియమ నిష్టలతో పూజ కార్యక్రమాలను ప్రతినిత్యం నిర్వహిస్తున్నారు. దుబ్బరాజేశ్వరస్వామి ఆలయంలో జరిగిన కార్యక్రమంలో చైర్మన్ పొరండ్ల శంకరయ్య, ఈవో పురుషోత్తమాచార్యులు, అర్ఛకులు, సిబ్బంది, భక్తులుపాల్గోన్నారు.