క్రైమ్/లీగల్

కౌలు రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మికుంట, నవంబర్ 21: జమ్మికుంట మండలంలోని వావిలాల గ్రామానికి చెందిన గాజర్ల సారంగం (49) అనే కౌలు రైతు పురుగుల మందు త్రాగి బుధవారం అత్మహత్యకు పాల్పడ్డడు. గాజర్ల సారంగం గత 5సంవత్సరాలుగా 6 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. గత సంత్సరంలో వర్షాలకు పత్తి పంట దెబ్బతిని అర్థికంగా తీవ్ర నష్టం కలిగింది. ఈ ఖరీప్ సీజన్‌లో మొక్కజోన్న పంట వేయగా వర్షాలు లేక,పంట రాలేదని ,5లక్షల వరకు అప్పుల పాలైనట్లు తెలిపారు. అప్పులు తీర్చే మార్గం లేక మనస్థాపంతో బుధవారం పురుగుల మందు సేవించి ,పత్తి చేనులో అత్మహత్యకు పాల్పడ్డడు. మృతుని భార్య రాజేశ్వరి, ఇద్దరు అడపిల్లలు ఉన్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు సి ఐ సృజన్‌రెడ్డి తెలిపారు.