కరీంనగర్

ముఖ్యమంత్రివి బడాయి మాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, మే 23: ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజానీకంలో ఎన్నో ఆశలు కల్పించి.. మరెన్నో హామీలిచ్చి అధికారంలోకొచ్చిన ముఖ్యమంత్రి వాటిని తుంగలో తొక్కి ప్రజావ్యతిరేక పాలన కొనసాగిస్తున్నాడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ఆపార్టీ మినీమహానాడు సందర్భంగా సోమవారం నగరంలో నిర్వహించిన జిల్లాస్థాయి సమావేశంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ మేనిఫెస్టో అమలు గాలికొదిలి.. ఆచరణ పేరుకే అన్నట్లుగా పాలన కొనసాగుతుందని విమర్శించారు. రాష్ట్రంలో పాలనాపగ్గాలు చేపట్టి రెండేళ్ళు కావస్తున్నా పేద,మద్యతరగతి, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఒరగబెట్టిందేమి లేదన్నారు. రెండు బడ్జెట్‌లలో రూ.2.15లక్షల కోట్లు కేటాయించినా, ఇప్పటివరకు చేసిన ఖర్చెంతో ఆ నలుగురికే తెలుసని ఎద్దేవా చేశారు. ఈమొత్తంతో జిల్లాకు రూ.21వేల కోట్లు, జిల్లాలోని ప్రతి సెగ్మెంట్‌కు రూ.1500కోట్ల వరకు వెచ్చించి, అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉండగా, ఇప్పటివరకు నియోజకవర్గంలో కనీసం రూ.100కోట్లు కూడా ఖర్చుచేయని దుస్థితి రెండేళ్ళలో నెలకొందని ఆవేదన వ్యక్తంచేశారు. వందల మంది యువకుల ఆత్మబలిదానాలతో ఆవిర్భవించిన తెలంగాణలోసిఎం కెసిఆర్ కొనసాగిస్తున్న పాలనాతీరుతో అమరుల ఆత్మలు క్షోభిస్తున్నాయన్నారు. అమరుల ఆశయాలకు భిన్నంగా వ్యవహరిస్తూ, వారి చిత్రపటాలతో అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి వారి కుటుంబసభ్యులను సైతం ఆదుకోవటంలో మొండిచేయే చూపుతున్నాడని దుయ్యబట్టారు. ఎన్నికలకు ముందు తెలంగాణ ద్రోహులుగా పేర్కొన్న వారినే తనపార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మంత్రిపదవులు కట్టబెడుతున్న సిఎం ఉద్యమంలో మొదటగా ఆత్మార్పణం చేసుకున్న శ్రీకాంతాచారి తల్లిని ఎందుకు ఎమ్మెల్సీ చేయలేదని, మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. నాడు ఉద్యమానికి సహకరించని నేతలంతా నేడు టిఆర్‌ఎస్‌లోనే ఉన్న దృష్ట్యా ఆపార్టీయే తెలంగాణ ద్రోహుల పార్టీ అని అన్నారు. తమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్లఎత్తుతో తలపెట్టిన ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టును 142మీటర్లకు కుదించి, తెలంగాణను మహారాష్టక్రు తాకట్టు పెట్టి, ఇక్కడి ప్రజలనోట్లో మట్టికొట్టడం ఏమేరకు సమంజసమన్నారు. జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు తన రాజకీయ ప్రాబల్యంతో సిఎం కెసిఆర్ నెత్తిన శఠగోపం పెట్టి, ప్రాజెక్టు ఎత్తు తగ్గించటంలో కృతకృత్యుడయ్యాడన్నారు. నీళ్ళు, నిధులు, నియామకాలే లక్ష్యంగా ఆవిర్భవించిన రాష్ట్రంలో గోదావరి నీటిని తన జిల్లాకు, నిధులను తన కుటుంబ జేబుల్లోకి మళ్ళిస్తుండగా, నియామకాలు మాత్రం ఇప్పటికీ చేపట్టడం లేదన్నారు. ఉమ్మడి రాజధానిలో 15లక్షల మందికి ఉపాధి చూపిన ఘనత అప్పటి తెలుగుదేశం ప్రభుత్వానిదేనన్నారు. బడుగు, బలహీన, మధ్యతరగతి, బిసిల్లో రాజకీయచైతన్యం తెచ్చి, వారికి రాజకీయవైభవం అందించిన తెలుగుదేశం పార్టీ సామాజిక తెలంగాణకు వేదికగా నిలుస్తుందన్నారు. పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి ఇనుగాల పెద్దిరెడ్డి మాట్లాడుతూ, ఇచ్చిన హామీలు నెరవేర్చేవరకు ఉద్యమాలు చేపట్టి, ప్రభుత్వ గుండెల్లో నిద్రపోతామన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్తకోట దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ కోటి ఎకరాలకు సాగునీరు ఎప్పుడందిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి చైతన్యపర్చాలని కార్యకర్తలకు సూచించారు. రాష్టన్రాయకుడు వొంటేరు ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ సీమాంధ్ర పాలకులు తెలంగాణను దోచేస్తే సిఎం కెసిఆర్ కొత్తరాష్ట్రాన్ని వల్లకాడుగా మారుస్తున్నాడన్నారు. జిల్లా అధ్యక్షుడు చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ, తలాపున నీళ్ళున్నా జిల్లావాసులకు మాత్రం తాగునీరు కూడా అందటంలేదని, ఇక్కడి నీటిని మెదక్‌కు తరలిస్తూ, జిల్లావాసులను పస్తులుంచుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సత్వరమే ఏకకాలంలో రైతురుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈసందర్భంగా కళాకారులు ఆలపించిన పాటలు ఆకట్టుకున్నాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వేలాదిమంది కార్యకర్తలు పాల్గొనగా, జిల్లా ప్రధాన కార్యదర్శి సంకు సుధాకర్, పలు సెగ్మెంట్‌ల ఇన్‌చార్జిలు అన్నమనేని నర్సింగారావు, ముద్దసాని కశ్యప్‌రెడ్డి, మేడిపల్లి సత్యం, సాంబరి ప్రభాకర్, మద్దెల రవీందర్, గంట రాములు, నూజెట్టి వాణి, బద్దం అజయ్‌రెడ్డి, కవ్వంపల్లి సత్యనారాయణ, తదితరులు ప్రసంగించారు.