కరీంనగర్
ధర్మపురి హుండీల ఆదాయం 20.31లక్షలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 24 May 2016
ధర్మపురి, మే 24: క్షేత్రంలోని శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి సంబంధించి, వివిధ ఆలయాలలో ఏర్పాటు చేసిన హుండీలను మంగళవారం ఉదయం 10.00 గంటల నుండి విప్పి లెక్కించగా 20లక్షల పైచిలుకు ఆదాయం లభించింది. దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్, కార్యనిర్వహణాధికారి సుప్రియ ఆధ్వర్యంలో, దేవాదాయ శాఖ జగిత్యాల డివిజన్ పర్యవేక్షకులు నవీన్ కుమార్ పర్యవేక్షణలో, ప్రధానార్చకులు రఘునాథాచార్య, సిబ్బంది నిర్వహణలో మార్చి 29 నుండి మే 24 వరకు 56రోజులకు సంబంధించి దేవస్థాన సంబంధిత హుండీలను విప్పి లెక్కింపు జరపగా 20,31,376 రూపాయల ఆదాయం లభించింది. 41గ్రాముల మిశ్రమ బంగారం, 2కిలోల 450 గ్రాముల మిశ్రమ వెండి, 20విదేశీ కరెన్సీ నోట్లు లభించాయి.