కరీంనగర్

మోగింది బడి గంట..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూన్ 13: జిల్లాలో సోమవారం బడి గంట మోగింది. విద్యా సంవత్సరం ఆరంభం కావడంతో జిల్లాలోని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమయ్యాయి. వేసవి సెలవుల్లో ఆట, పాటలతో ఎంజాయ్ చేసిన విద్యార్థులు బడి బాట పట్టగా, నిన్నటిదాకా బోసిపోయి కన్పించిన పాఠశాలలు చిన్నారులతో కళకళలాడాయి. ఇటు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు పక్షంరోజుల నుంచే విద్యార్థులను ఆకర్షించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేయగా, అటు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు సైతం బడి బాట కార్యక్రమం పేరిట గ్రామాల్లో ప్రచారాలు నిర్వహించి, కార్పొరేట్ స్థాయిలో బోధిస్తామంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు హామీలిచ్చిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించేందుకు పలు గ్రామాల్లో తీర్మానాలు కూడా చేయడంతోపాటు పాఠశాలలకు పంపించారు.