కరీంనగర్

బంగారు తెలంగాణ సాధించటమే కెసిఆర్ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుల్తానాబాద్, జూన్ 28: బంగారు తెలంగాణ సాధించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ముందుకు వెళ్తున్నారని పెద్దపల్లి మాజీ ఎంపి జి.వివేక్ అన్నారు. మంగళవారం సుల్తానాబాద్ ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటుకోసం ఉద్యమం చేయడం జరిగిందని, సాధించిన తెలంగాణను ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలో బంగారు తెలంగాణగా మార్చుకునేందుకు గాను మిషన్ కాకతీయ, డబుల్ బెడ్‌రూం, మిషన్ భగీరథతో పాటు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ ముందుకు వెళ్తున్నారని అన్నారు. పెద్దపల్లి అభివృద్ధికి గాను ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, ఎంపి బాల్క సుమన్‌తో కలిసి అభివృద్ధికి పాటుపడతానని అన్నారు. టిఆర్‌ఎస్‌లో చేరి మొదటిసారిగా సుల్తానాబాద్‌కు వచ్చిన ఆయనకు యువకులు, నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. టిఆర్‌ఎస్ నాయకులు కాంపెల్లి నారాయణ, సత్యనారాయణ, సజ్జత్‌తో పాటు కాంపెల్లి వంశీ, పవన్, పలువురు పూలమాలలతో శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. వివేక్ వెంట నాయకులు జువ్వాడి నర్సింగారావు తదితరులు ఉన్నారు.