కరీంనగర్

కౌలు రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూలపల్లి, జూలై 29: మండలంలోని కాచాపూర్ గ్రామానికి చెందిన కైలు రైతు గండు సంజీవ్ (38) అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సంజీవ్ గత రెండు ఏళ్లుగా 5 ఎకరాల భూమి కౌలుకు తీసుకుని పత్తి పంట సాగు చేశాడు. పంట దిగుబడి సక్రమంగా లేక దాదాపు రూ. 5లక్షలపైన అప్పులయ్యాయి. అప్పులు తీర్చలేక మనస్థాపానికి గురై ఈ నెల 28న పంట చేనులోనే పురుగుల మందు తాగగా గమనించిన కుటుంబ సభ్యులు పెద్దపల్లి ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్సకై కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా సాయంత్రం 7:30 గంటలకు మృతి చెందాడు. ఈ మేరకు అతని భార్య సుజాత ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రఫీక్‌ఖాన్ తెలిపారు.