కరీంనగర్

కాళేశ్వరం వద్ద అంత్య పుష్కర శోభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహదేవపూర్, ఆగస్టు 2: మండలంలోని పవిత్ర పుణ్య క్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర త్రివేణి సంగమ తీరంలో జరుగుతున్న గోదావరి అంత్య పుష్కరాలు మంగళవారం 3వ రోజుకు చేరుకున్నాయి. అమవాస్య సందర్భంగా భక్తుల తాకిడి తగ్గింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు హాజరై గోదావరి పుణ్య స్నానాలు చేశారు. మహిళలు గోదావరి తల్లి వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. పూజలు చేశారు. పితృ దేవతలకు పిండ ప్రదానం చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆలయ ప్రధాన అర్చకులు గోదావరి తల్లికి వేద మంత్రోచ్ఛరణల నడుమ హరిత ఇచ్చారు. కార్యక్రమంలో ఈవో ప్రకాష్, మాజీ ధర్మకర్త అశోక్ పాల్గొన్నారు.