కరీంనగర్

వృద్ధురాలి హత్య కేసులో జీవిత ఖైదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మారం, ఆగస్టు 12: మండలంలోని ఖానంపల్లి గ్రామానికి చెందిన గుర్రం శ్యామల (60) అనే వృద్ధురాలిని 2012 సంవత్సరంలో పెద్దపల్లి మండలం అప్పన్నపేటలో నివాసం ఉంటున్న కూకట్ల కొమురయ్య హత్య చేసినట్లు కేసు నమోదు కాగా, అతనికి జీవిత ఖైదు శిక్షపడినట్లు ధర్మారం ఎస్‌ఐ లక్ష్మినారాయణ తెలిపారు. 15.9.2012 సంవత్సరంలో ఖానంపల్లి గ్రామంలో ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలు గుర్రం శ్యామలను గుర్తు తెలియని వ్యక్తి హత్య చేసినట్లుగా పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణలో కూకట్ల కోమురయ్య నేరం చేసినట్లు తెలువడంతో కరీంనగర్‌లోని ఫస్ట్ అడిషనల్ సెషన్ జడ్జి బి.సురేష్ కుమార్ కొమురయ్యకు జీవిత ఖైదుతో పాటు 900 రూపాయల జరిమానా విధించినట్లు ఎస్‌ఐ తెలిపారు.