తెలంగాణ

లారీని ఢీకొన్న కారు: నలుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్: మానవపాడు మండలం జల్లాపూర్ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలు జిల్లాకు చెందిన నలుగురు వ్యక్తులు మరణించారు. ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. తమ బంధువును దుబాయ్ విమానం ఎక్కించిన అనంతరం ఓ కుటుంబానికి చెందిన వ్యక్తులంతా కారులో హైదరాబాద్ నుంచి కర్నూలుకు సోమవారం ఉదయం తిరుగుప్రయాణమయ్యారు. వీరు ప్రయాణిస్తున్న కారు జల్లాపూర్ వద్ద సిమెంటు లోడుతో వస్తున్న లారీని ఢీకొంది. దీంతో కారులో ఉన్న నలుగురు మరణించారు. మృతులను నిసార్ అహ్మద్ (62) , రిజ్వానా (56), అనియా (4), ఫర్జానా (30)గా గుర్తించారు. గాయపడిన ఆలియా ఖాతుర్ అనే మహిళను కర్నూలు ఆస్పత్రిలో చేర్పించారు.