ఆంధ్రప్రదేశ్‌

ఒక్క రౌడీ వల్లే పులివెందులలో.. : బాబు వ్యాఖ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: టిడిపి మహానాడు రెండో రోజు సభలో ఆ పార్టీ అధినేత, ఎపి సిఎం చంద్రబాబు పులివెందుల పట్టణంపైన, పరోక్షంగా వైకాపా అధ్యక్షుడు జగన్‌పైనా సెటైర్లు వేసి అందరినీ నవ్వించారు. ‘పులివెందులలో అంతా మంచోళ్లే.. కానీ, ఒక్క రౌడీ షీటర్ వల్లే..’ అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో కార్యకర్తలంతా ఒక్కసారి పగలబడి నవ్వారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడేందుకు సిసి కెమెరాలు పెట్టిస్తున్నామని, రౌడీ షీటర్ల ఫొటోలు, వేలిముద్రలు తీసుకుంటున్నామని, వారు ఎక్కడికైనా వస్తే చాలు మనకు అలెర్ట్ వస్తుందని అన్నారు. ఇక్కడికి ఆ పులివెందుల రౌడీ వస్తే చాలు పోలీసులు వెంబడిస్తారంటూ అందరికీ బాబు నవ్వు తెప్పించారు.