ఆంధ్రప్రదేశ్‌

అభివృద్ధిని అడ్డుకుంటున్న అరాచక శక్తులు: బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు తాను ప్రయత్నిస్తుండగా కొందరు వివిధ రూపాల్లో అరాచకాలు సృష్టిస్తున్నారని సిఎం చంద్రబాబు పరోక్షంగా వైకాపాపై విమర్శల దాడి చేశారు. ఇక్కడ శుక్రవారం ప్రారంభమైన టిడిపి మహానాడులో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎక్కడ అరాచకం జరిగినా అందులో వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యుల పాత్ర ఉంటోందని అన్నారు. కాపు గర్జన సందర్భంగా తునిలో విధ్వంసం వెనుక ఎవరి పాత్ర ఉందో ప్రజలకు తెలుసన్నారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు అనంతపురం జిల్లాలో టిడిపి నేత పరిటాల రవిని ఆ శక్తులే హత్య చేశాయని, అది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని అన్నారు. నేరచరిత్ర ఉన్న కొందరు నేతలు విధ్వంసాలకు పాల్పడుతూ ప్రజానీకంలో భయభ్రాంతులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి శక్తులకు గుణపాఠం ఖాయమన్నారు.