ఆంధ్రప్రదేశ్‌

నేడు కడపలో మహాసంకల్ప సభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప: ఎపి సర్కారు చేపట్టిన నవ నిర్మాణ దీక్ష ముగింపు సందర్భంగా కడపలో బుధవారం సాయంత్రం జరిగే మహాసంకల్ప సభకు భారీ ఏర్పాట్లు చేశారు. ఇక్కడి మున్సిపల్ మైదానంలో ప్రధాన వేదికను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ఏర్పాట్లు చేశారు. సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకూ జరిగే సభలో సిఎం చంద్రబాబు, టిడిపి యువనేత లోకేష్, ఎపి టిడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావు, పలువురు మంత్రులు, ఎపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి టక్కర్, డిజిపి జెవి రాముడు తదితరులు పాల్గొంటారు. విఐపిలు వస్తున్నందున కడప ఎయిర్‌పోర్టుతో పాటు మున్సిపల్ మైదానంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సభ ముగిశాక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో అధికారులతో సిఎం సమీక్ష జరుపుతారు. ఈరోజు రాత్రికి చంద్రబాబు ఇక్కడే బస చేసి గురువారం ఉదయం విజయవాడకు వెళతారు.