ఆంధ్రప్రదేశ్
మంజునాథ కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణ : బీసీ సంఘాల ఆందోళన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 19 September 2016
తిరుపతి: రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మంజునాథ కమిషన్ తిరుపతి మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహిస్తోంది. కాపులతో 11 కులాలను బీసీలో చేర్చడంపై ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తున్నారు. వివిధ సంఘాలకు చెందిన నాయకులు తమ అభ్యంతరాలతో పాటు, సమస్యలను బీసీ కమిషన్ దృష్టికి తీసుకువస్తున్నారు. కాపు సంఘం నేతలు పెద్ద ఎత్తున వినతులను అందజేశారు. మరోవైపు కాపులను బీసీలో చేర్చొద్దంటూ బీసీ సంఘాలు సమావేశ ప్రాంగణంలో ఆందోళన నిర్వహిస్తున్నాయి. అభ్యంతరాలను తెలుపాల్సిందిగా బీసీ కమిషన్ చైర్మన్ కోరడంతో బీసీ సంఘాల నాయకులు వినతి పత్రం అందజేశారు.