మహబూబ్‌నగర్

ముఖ్యమంత్రి కళ్లు తెరిపిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, నవంబర్ 8 : రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టినటువంటి మహాజన పాదయాత్ర ద్వారా మాట తప్పిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కళ్లు తెరిపిస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మంగళవారం మహాజన పాదయాత్ర అమరచింత మండల కేంద్రానికి చేరుకున్న అనంతరం బస్టాండ్ కూడలీల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులను పతకం ప్రకారం ముఖ్యమంత్రి ఇంకా అనుగదొక్కుతున్నారని, ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి మూడు ఎకరాల భూపంపిణీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టినటువంటి మహజన పాదయాత్ర పూర్తయ్యే లోపుగా దళితులకు భూపంపిణీ చేపట్టని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మిగులు భూములను గుర్తించి ఎర్రజెండాలు పాతి తామే దళితులకు పంపిణీ చేస్తామని ఆయన వెల్లడించారు. రైతులకు రుణమాపీ ప్రకటించినప్పటికి రెండు విడుతలుగా విడుదల చేసిన రుణమాఫీ కేవలం బ్యాంకర్లకు వడ్డీలకే సరిపోతుందని, అన్నదాత పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్ర అనంతరం సమస్యలపై పోరాడేందుకు ప్రత్యేక ప్రణాళిక లు రూపొందించి వామపక్షాల నేతృత్వంలో ముఖ్యమంత్రికి కంటి మీద కునుకు లేకుండా చేస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమానికి సిపి ఎం మండల కార్యదర్శి డి. ఎస్ గోపి అధ్యక్షత వహించగా రాష్టక్రార్యవర్గ సభ్యులు జాన్‌వేస్లీ, జిల్లా కార్యదర్శి జబ్బార్, పలువురు నేతలు పాల్గొన్నారు.