మహబూబ్‌నగర్

ఆటోను ఢీ కొట్టిన బొలేరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకద్ర, నవంబర్ 19: దేవరకద్ర సమీపంలోని రాయిచూర్, మహబూబ్‌నగర్ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి ఆటోను, బోలేరా జీప్పు ఢీకొట్టింది. దాంతో మండల పరిధిలోని గూరకొండ గ్రామానికి చెందిన ఉషనమ్మ(30) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, హాస్పటల్‌లో చికిత్స పొందుతూ ఎరుకలి మణెమ్మ (31) మృతి చెందింది. ఆటోలో ప్రయాణిస్తున్న మరో పది మందికి తీవ్రగాయాలయ్యాయి. అందులో గూరకొండ గ్రామానికి చెందిన మనపురం లక్ష్మీ, సంపల్లి లక్ష్మీ, మంగమ్మలకు తీవ్ర గాయాల బారిన పడడంతో వీరి పరిస్థితి విషమంగా ఉంది. గాయాల బారిన పడ్డవారిని జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. టిఎస్06యుబి4617 నంబర్ గల ఆటోను కొటకదిర నుండి గూరకొండ గ్రామానికి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన బొలేరా జీప్పు వచ్చి అతివేగంగా ఢీకొట్టింది. అయితే బొలేరా జీప్పు ఆటోను ఢీకొట్టి డ్రైవర్ ఆపకుండానే వెళ్లిపోయాడు. వాహనాన్ని పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న ఎస్సై ఆశోక్‌కుమార్ తెలిపారు.