మహబూబ్‌నగర్

అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జడ్చర్ల, ఫిబ్రవరి 18: మండల పరిధిలోని కిష్టంపల్లిలో ఆదివారం నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల లో వైద్య ఆరోగ్యశాఖమంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. గ్రామంలో నిర్మించతలపెట్టిన డబుల్‌బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే నాగర్‌కర్నూల్ రోడ్డు నుండి కిష్టంపల్లి వరకు రూ. 30లక్షల తో చేపట్టనున్న బిటి రోడ్డు నిర్మాణాని కి మంత్రి శంకుస్థాపన చేశారు. గ్రామ సమీపంలోగల మల్లమ్మ దేవత బోనా ల ఉత్సవాలల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కిష్టంపల్లి గ్రామ ప్రజలు తాగునీటి బోరు సమస్యను మంత్రి దృష్టికి తీసుకురాగా ఆయన వెంటనే పరిష్కరించాలని అ ధికారులకు ఆదేశించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన టిఆర్‌ఎస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. మల్లమ్మ దేవాలయం అబివృద్ధికి సహకరించాలని దేవాలయ అబివృద్ధి కమి టీ సభ్యులు కోరగా అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. కార్యక్రమాల్లో ఎంపిపి లక్ష్మి, జడ్పిటిసి జ యప్రద, టిఆర్‌ఎస్ మండల అధ్యక్షు డు కోడ్గల్ యాదయ్య, గోవర్థన్‌రెడ్డి, ఇమ్మూ, తదితరులు పాల్గొన్నారు.