ఆంధ్రప్రదేశ్‌

కాల్వలోకి దూకిన కారు: ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: అన్నవరంలో వివాహానికి హాజరయ్యేందుకు కారులో వెళుతుండగా ముగ్గురు మరణించారు. ఆలమూరు మండలం జొన్నాడ వద్ద సోమవారం ఉదయం వేగంగా వెళుతున్న కారు రోడ్డుపక్కన పంట కాల్వలో పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా మరో ముగ్గురు గాయపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఓ కుటుంబం కారులో పెళ్లికి వెళుతుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. మృతుల కుటుంబాలకు ఎపి హోం మంత్రి చినరాజప్ప సంతాపం తెలిపారు.