క్రైమ్/లీగల్

వైద్యుల నిర్లక్ష్యంతో ఒకరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట అర్బన్, నవంబర్ 22: వైద్యురాలు నిర్లక్ష్యం వల్ల వ్యక్తి మృతిచెందాడని డాక్టర్లను నిలదీసిన సంఘటన సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం నాడు జరిగింది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కొండపాక మండలం దుద్దెడ గ్రామానికి చెందిన చిలుముల రవి కడుపు, చాతిలో నొప్పి వస్తుండటంతో 108లో సిద్దిపేట ఏరియా అస్పత్రికి తరలించారు. డ్యూటీలో ఉన్న డాక్టర్‌కు విషయం చెప్పినా పట్టించుకోలేదు. దీంతో రవి ఆస్పత్రిలోనే మృతిచెందాడు. డ్యూటీ డాక్టర్ నిర్లక్ష్యం వల్లే రవి మృతి చెందాడని బాధితుడి కుటుంబ సభ్యులు వైద్యులను నిలదీసి ఆందోళన చేపట్టారు. రవికి మృతికి కారణమైన డాక్టర్‌పై చర్య తీసుకోవాలని డిమాండ్‌చేశారు. మృతుని బంధువు రాజారాం ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకుని సిద్దిపేట పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు.