రాష్ట్రీయం
ప్రజాధనంతో విలాసవంతమైన భవనం అవసరమా?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 28 April 2018
హైదరాబాద్: నగరం నడిబొడ్డిన రూ.500 కోట్ల విలువైన స్థలంలో 50 నుంచి 60 కోట్ల రూపాయలతో విలాసవంతమైన భవనం అవసరమా అని మాత్రమే తాను ప్రశ్నించానని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు. ఆయన శనివారంనాడు మీడియాతో మాట్లాడుతూ ప్రగతి భవన్లో 150 గదులు ఉన్నాయని తాను ఏనాడు అనలేదని అన్నారు. సీఎం కేసీఆర్ ఇతరులను కించపరుస్తూ తన వ్యక్తిత్వాన్ని వెల్లడించుకుంటున్నారని ఉత్తమ్ విమర్శించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి విలాసవంతమైన జీవితాన్ని గడపటం అవసరమా అని ప్రశ్నించారు. దేశ ప్రధాని కూడా ఇలా భవనాన్ని నిర్మించుకోలేదని అన్నారు. ప్రగతి భవన్ లక్ష చదరపు అడుగులు కాదా? బుల్లేట్ ప్రూఫ్ కాదా అని ప్రశ్నించారు.