ఆంధ్రప్రదేశ్‌

ఆస్తికోసం కూతుర్ని చంపిన తండ్రి !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు: ఆస్తికోసం కన్నకూతురిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన తండ్రి కిరాతకం ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రకాశం జిల్లా ఒంగోలులో గత నెల 3న కటకం దుర్గా భవానీ (15) మరణించింది. ప్రేమ విఫలమై భవానీ ఆత్మహత్య చేసుకుందని ఆమె తండ్రి వెంకటేశ్వర్లు అందరినీ నమ్మించి అంత్యక్రియలు పూర్తి చేయించాడు. అయితే, వెంకటేశ్వర్లు ప్రవర్తనపై కాశీలో ఉంటున్న ఆయన కుమారుడికి అనుమానం కలిగి ఇక్కడికి వచ్చిన సందర్భంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దుర్గా భవానీ పేరు మీద ఉన్న 50 లక్షల రూపాయల ఆస్తి ఉంది. ఆమె పోలయ్య అనే వ్యక్తిని ప్రేమించి తరచూ ఇంటి నుంచి వెళ్లిపోతుండేది. ఆమె ఆస్తి ఇతరులకు దక్కకూడదన్న కుట్రతో తాను ఈ ఘాతుకానికి పాల్పడినట్లు వెంకటేశ్వర్లు పోలీసుల విచారణలో అంగీకరించాడు. ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేస్తానని నమ్మించి కూతురిని ఇంటికి పిలిచి, తన సోదరి కుటుంబ సభ్యుల సహకారంతో భవానీని కన్నతండ్రే కడతేర్చాడు.