క్రైమ్/లీగల్

అదృశ్యమైన యువతి దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూర్ (యం)/మోత్కూర్, మార్చి 6: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లోబర్చుకొని.. మోసం చేసిన ప్రేమికుడు.. చివరికి ప్రేమికురాలిని దారుణంగా హత్య చేసి బావిలో పూడ్చివేసిన సంఘటన మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ కె.యాదగిరి తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూర్(యం)లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తున్న మోత్కూర్ మండల కేంద్రానికి చెందిన బొడ్డుపల్లి భార్గవి(23)ని గత రెండు సంవత్సరాలుగా అదే మండలంలోని బుజులాపురం గ్రామానికి చెందిన కస్తగాని నరేందర్‌గౌడ్ ప్రేమ పేరుతో శారీరకంగా లోబర్చుకున్నాడు. అయితే నరేందర్‌గౌడ్‌కు మరో యువతితో వివాహం నిశ్ఛయం కావడంతో నిలదీసిన భార్గవిని ఈ నెల 3న ప్రేమికుడు బుజిలాపురం గ్రామంలోని తన వ్యవసాయ పొలం వద్దకు తీసుకెళ్లి హత్య చేసి మృతదేహాన్ని బావిలో పూడ్చిపెట్టాడు. మరుసటి రోజు సుద్ధాల గ్రామానికి చెందిన మరో యువతిని వివాహం చేసుకున్నాడు. అయితే ఇంటి నుండి వెళ్లిన కుమార్తె భార్గవి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తండ్రి బుచ్చయ్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ యాదగిరి కేసు నమోదు చేసుకొని దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో భార్గవి ప్రేమికుడు నరేందర్‌గౌడ్‌ను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించడంతో నేరాన్ని అంగీకరించాడు. బావిలో పూడ్చిపెట్టిన యువతి మృతదేహాన్ని పోలీసులు వెలికితీసి పోస్టుమార్టమ్ నిమిత్తం రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. యువతిని నమ్మించి కడతేర్చిన కసాయి ప్రేమికుడిని కఠినంగా శిక్షించాలంటూ గ్రామస్థులు ఆందోళన చేపట్టారు.