క్రైమ్/లీగల్

మూడురోజుల్లో పెళ్లి.. అంతలోనే విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్వపల్లి, ఏప్రిల్ 9: మూడురోజుల్లో వివాహం జరుగాల్సి ఉండటంతో బంధుమిత్రులతో సందడిగా ఉన్న ఆ ఇంట్లో అనుకొని ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. విద్యుత్‌షాక్‌కు గురై పెళ్లికుమారుని తండ్రి, బావ మృతిచెందిన విషాదకర సంఘటన సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల పరిధిలోని కొమ్మాల గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బాషపోలు సత్యనారాయణ కుమారుడు ఉపేందర్ వివా హం నిశ్చయమైంది. ఈనెల 12న వివా హం జరుగనుండటంతో పెళ్లి పనుల్లో భాగంగా ఇంటి ముందు ఉన్న రేకులను సరిచేస్తున్న క్రమంలో బాషపోలు సత్యనారాయణ (55), జనగాం జిల్లా కొడకండ్ల గ్రామానికి చెందిన అల్లుడు గవ్వాని శోభన్‌బాబు (30)లతో పాటు మరో నలుగురు బంధువులతో కలిసి పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు ఇంట్లో కి విద్యుత్ సరఫరా కోసం ఏర్పాటుచేసిన సర్వీస్ వైర్ తెగి రేకులకు విద్యుత్ సరఫరా కావడంతో మామ, అల్లుళ్లు అక్కడిక్కడే మృత్యువాత పడగా సత్యనారాయణ కుమారుడు ఉపేందర్, మరో అల్లుడు వెంకటేశం, అన్న కుమారుడు విజయ్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు సత్యనారాయణకు భార్య, ఇద్దరు కూమార్తెలు, ఒక కుమారుడు ఉండగా శోభన్‌బాబుకు భార్య, కుమారుడు ఉన్నారు. మృతుడు సత్యనారాయణ భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎ.మోహన్‌రెడ్డి తెలిపారు.
ఎమ్మెల్యే పరామర్శ: విద్యుత్‌షాక్‌తో మృతిచెందిన సత్యనారాయణ కుటుంబాన్ని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ పరామర్శించారు. మృతులకు రూ.8లక్షల ఎక్స్‌గ్రేషియా అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట ఎంపీపీ దావుల మనీషావీరప్రసాద్, సర్పంచ్ సురేందర్‌రెడ్డి, ఎంపీటీసీ వసంతపూర్ణచంద్రారెడ్డి ఉన్నారు.